EY Employee Death: నిద్రకు, తినడానికి సమయం లేదు, ఫోన్ చేసి ఏడ్చేది.. అన్నా సెబాస్టియన్ తండ్రి..
- కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తున్న అన్నా సెబాస్టియన్ మరణం..
- తన కూతురు పని ఒత్తిడితో ఫోన్ చేసే ఏడ్చేది..
- తినడానికి.. నిద్రించడానికి సమయం కూడా లేదు..
- అన్నా తండ్రి సిబి జోసెఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EY Employee Death: అన్నా సెబాస్టియన్ పెరాయిల్ అనే 26 ఏళ్ల యువతి మరణం ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియాలో సీఏగా పనిచేస్తున్న అన్నా ‘‘పని ఒత్తిడి’’ కారణంగా మరణించిన ఘటన ఇప్పుడు కార్పొరేట్లో చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. ఆఫీస్ కల్చర్ యువ ప్రాణాలు ఎలా బలి తీసుకుందనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే దాన్ని వెలుగులోకి తెచ్చింది. కేరళకు చెందిన అన్నా, పూణేలో సీఏగా పనిచేస్తోంది.
అన్నా సెబాస్టియన్ మరణం వర్క్ కల్చర్లో రాబోయే మార్పులకు కారణమవుతుందా.? అనేది తర్వాత విషయం కానీ, ఆమె మరణం మాత్రం కార్పొరేట్ వరల్డ్లో తాము ఎలాంటి బాధల్ని అనువిస్తున్నామనే విషయాలను పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొందరు కార్పొరేట్ జాబ్ వద్దు అని చెబుతున్నారంటే అందులో ఎలాంటి ఒత్తిడి ఉందో తెలుస్తోంది.
Also Read
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
Read Also: Mrunal Thakur: బాయ్ఫ్రెండ్ను పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్ !
తాజాగా అన్నా తండ్రి సిబి జోసెఫ్ తన కూతురు ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఒక్కోసారి ఫోన్ చేసి ఏడ్చేదని జోసెఫ్ శనివారం చెప్పారు. తాను చాలా సార్లు రాజీనామా చేసి వచ్చేయాలని చెప్పినప్పటికీ, ఈవై కంపెనీలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందని చెప్పేదని, అందుకే ఆ సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించుకుందని చెప్పారు. అన్నా జోసెఫ్ జూలై 21న తన ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. సహోద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించారు, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించింది.
తన కూతురు అర్థరాత్రి వరకు పనిచేసేదని, ఆమె హాస్టల్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా సంబంధం లేని ఇతర పనులు కూడా చేసేదని చెప్పారు. తన కూతురు నిద్రించడానికి, తినడానికి సమయం కూడా దొరకతనంత ఒత్తిడికి గురైందని ఆవేదన వెల్లగక్కారు. ‘‘ఆమె అక్కడ మార్చి 18న చేరింది. ఒక వారం తర్వాత ఆమె రెగ్యులర్ ఆడిటింగ్ ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి, ఆమెను 6 వ బృందంలో చేర్చారు. ఆడిట్ మేనేజర్ ఆమె పనిని సమీక్షించాలి. ఆమె రాత్రంతా పనిచేయాల్సి వచ్చేది. హాస్టల్ చేరిన తర్వాత కూడా పనితో సంబంధం లేని అదనపు పనులు చేసేది’’ అని అన్నా తండ్రి చెప్పారు.
‘‘మేనేజర్ పనిని సమీక్షించలేదు, అతను క్రికెట్ అభిమాని, క్రికెట్ షెడ్యూల్కి అనుగుణంగా తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేవాడు. దాని కారణంగా ఆమె తన పనిని చేయాడానికి మరింత ఆలస్యమయ్యేది’’ అని జోసెఫ్ చెప్పారు. EY యొక్క పని సంస్కృతి మరియు అధిక పనిభారం తన కుమార్తె మరణానికి కారణమని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి రాసిన హృదయ విదారక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్నా మరణం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!