Blast : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి మావోయిస్టుల ఉనికిని గుర్తుచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం జరిగిన ల్యాండ్మైన్ పేలుడులో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో మావోయిస్టుల తాకిడి ఎదురవ్వగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.…