Business Headlines 07-03-23: పేటీఏం-ఏపీ ఒప్పందం: పేటీఎం సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఆరోగ్యం మరియు సైబర్ భద్రత వంటి రంగాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల నుంచి మరియు వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తాయి. టోల్ ప్లాజాలు సైతం ఈ ఆన్లైన్ పేమెంట్లను తీసుకుంటాయి.
క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను కలిశారు ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు.. సీఎంను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు… ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూపు.. ఈ ఏడాది నవంబర్లో స్టీల్ ప్లాంట్ పనులుకు శంకుస్ధాపన చేసేందుకు సిద్ధమవుతోంది.