ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు విధించిన బ్యాన్ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. బదిలీల గైడ్ లైన్స్ జారీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తే కచ్చితంగా స్థాన చలనం కల్పించాలని స్పష్టం చేసింది.…