Krishna's movie 'Eenadu' completes 40 years: 'నటశేఖర'గా, 'సూపర్ స్టార్'గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు'. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత 'పద్మాలయా పిక్చర్స్' పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి నుంచీ 'ఈనాడు' పై సినీఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 1982 డిసెంబర్ 17న విడుదలైన 'ఈనాడు'…