East Godavari Floods: తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Godavari Flood: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నీటి మట్టం క్రమంగా పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే, నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో వెంటనే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు.