బీహార్లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో…
మద్యం తాగితే మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పడానికి ఏపీలో జరిగిన ఓ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. చదువు, సంధ్య లేకుండా బలాదూర్ తిరుగుతూ జల్సాలకు అలవాటు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు కూడా మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో స్నేహితులతో ప్రతిరోజూ మద్యం తాగుతూ దొంగతనాలు కూడా చేస్తున్నాడు. Read Also: రాజధాని…
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్కు ఆనంద్ మహీంద్రా ఫిదా తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో…
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన భూమిక చావ్లా… స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ సీనియర్ నటి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు కీలక పాత్రల్లో తళుక్కుమంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే, తాజాగా…