‘అందాల రాక్షసి’ తో తెలుగు తెరకు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తన నటనతో మెప్పించినప్పటికీ, కమర్షియల్ హిట్లు మాత్రం కొంత కాలంగా దక్కడం లేదు. అయినా కూడా, ఆయన వినూత్న కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వరుస పెట్టి త్రిల్లింగ్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నవీన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ బజ్ను సృష్టించింది. ఈ సమ్మర్లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనున్న ‘భైరవం’…
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
Mangalavaram: ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నటులు ఎక్కువ అయిపోయారు. జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఛాలెంజింగ్ గా ఉండాలి. నెగెటివ్ షేడ్స్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ అలంటి పాత్రలు అయితేనే ముందుకు వస్తున్నారు.
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కారణంగా పరభాషా చిత్రాలను మాతృభాషలో చూడగలిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికులకు లభిస్తోందంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాలను కమర్షియల్ యాస్పెక్ట్ లో నిర్మాతలు డబ్ చేయడానికి తటపటాయించే సమయంలో ఆహాలో వాటిని చూడగలగడం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామస్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో…