మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం నాడు ఎయిమ్స్ వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.…
ప్రముఖ నటుడు, డిఎండికె (దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం) చీఫ్ విజయకాంత్ నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం విజయకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే మరోవైపు మే 19న విజయకాంత్ కు శ్వాస సమస్యలు రావడంతో ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రికి తరలించినట్టుగా వార్తలు విన్పించాయి. వైద్యులు అతన్ని పరీక్షించారు మరియు కోవిడ్ -19…