ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’…