Devulapalli Krishna Shastri: తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అంటే ప్రఖ్యాత దర్శకులు బి.యన్.రెడ్డి రూపొందించిన ‘మల్లీశ్వరి’నే ముందుగా చెప్పుకోవాలి. అందులో ప్రతీ పాట సందర్భోచితంగా అమృతం చిలికింది. అందుకు బి.యన్. కళాతృష్ణ ఓ కారణమయితే, ఆయన మదిని చదివి మరీ సాహిత్యం చిలికించిన ఘనత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిదే! దేవులపల్లి వారి వాణికి అనువుగా సాలూరు రాజేశ్వరరావు బాణీలు సాగాయి. అందుకే ‘మల్లీశ్వరి’ ఓ పాటల పందిరిగా ఈ నాటికీ సాహితీ సువాసనలు వెదజల్లుతూనే ఉంది.…