దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాత బిల్డింగ్ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.