ఓటీటీ వేదికగా తెలుగు ఒరిజినల్ కంటెంట్కు ఆదరణ పెరుగుతోందని జీ5 తెలుగు మరోసారి నిరూపించింది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్పై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్…