ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్కుమార్. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’లో జయమ్మగా మాస్ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ ను కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ…