నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పద్మజ ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. అలాగే నటుడు, ‘బ్రీత్’ ఫేమ్ చైతన్య కృష్ణ తల్లి. ఆమె మరణం నందమూరి కుటుంబానికే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా తీరని లోటు గా మారింది.…