మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మధ్య వివాదం మరింత ముదిరింది.. ఈ వ్యవహారం సీఎస్, సీఎం వరకు వెళ్లింది.. సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన పేర్ని నాని.. ప్రసన్న వెంకటేష్ ఫిర్యాదు చేయగా.. మరోవైపు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్..
చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయడం సరికాదంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడతారా..? అని ప్రశ్నించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్తో సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్ కార్డ్లు, 11వ వేతన సంఘం అంశాలపై చర్చించాం.. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగాం.. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని…
Intermediate Exams: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది.. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.. అయితే, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో…
గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1,2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని చెప్పారు.
తీరం దాటిన మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఇక, తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు…