విశాఖలో భూవివాదం చినికి చినికి గాలివానగా మారింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు మధ్య భూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మధురవాడలోని వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మధురవాడ సర్వే నెంబర్ 225లో కాలువపై కట్టిన కల్వర్ట్ ని అనధికారిక నిర్మాణంగా గుర్తించారు. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు రస్తాగా నమోదు…