తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు.…
ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి… ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు.ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా?.. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నపుడు ఆ పదవిని దుర్వినియోగం చేశారని నిప్పులు చెరిగారు. బీసీలను దగ్గరకు రానీయలేదు.. ఈటల వ్యాపార భాగస్వామ్యులు…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తాయి పోతాయి… తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న…
మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, రాజయ్యగారి ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన గతాన్ని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన ముత్యం రెడ్డి ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేసుకున్నారు.…
టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల…
ఈటల పేరు ముఖ్యమంత్రి గా టిఆర్ఎస్ లో తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లా లో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీద కు వచ్చింది. అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి వీలు ఉండదు. పట్టభూముల పక్కకి అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్…
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. మొదట కరోనా కట్టడిపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు, వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంపై స్పందించిన వీహెచ్.. మంత్రి ఈటల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఆగడం లేదు.. ఈ పరిస్థితిలో…
తెలంగాణలో ఎన్టీవీ కథనం సంచలం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడగా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని…
తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్…