కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు..క్యాబినెట్ సమావేశంలో క్లాస్.తీసుకున్నారు... ఎమ్మెల్యేల పనితీరు మరకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు... ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు. అధికారులు... వెంటనే దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందజేశారు..