యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో హతుడి మామ అమృతరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆ కేసులో మరో నిందితుడు అబ్దుల్ బారీకి గుండె నొప్పి రావడంతో అతడిని నిమ్స్ కు తరలించారు జైల్ అధికారులు. గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని, చికిత్స జరుగుతోందని జైలు అధికారులు తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు సుపారీ గ్యాంగ్ ను సమకూర్చి పెట్టాడు రౌడీ షీటర్ అబ్దుల్…
రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో అభిమానం వెల్లువెత్తింది. కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామపంచాయతీ లోని ఊరి నాయన పల్లి గ్రామంలో నందమూరి తారకరామారావు అభిమానులు ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా వారి గ్రామంలో కొత్తగా జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు బాబులకే బాబు …తారక్ బాబు కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు… అంటూ నినాదాలు చేశారు.…
ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు. అహంభావానికి,…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…
ఏపీలో సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఫల్యాలపై 28వ తేదీన ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించామన్నారు. ఆర్ధిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుంది. కాగ్ కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. ఆదాయం సమకూర్చకుండా సంక్షేమానికి…
ఏపీలో ఒక వైపు టికెట్ల రేట్ల పై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ కామెంట్స్ చేయడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు…
ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు…
ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థకు సర్వం సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా APSFTVDC నియామించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది APSFTVDC. ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ఎలా వుండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. పోర్టల్ రూపకల్పనపై ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్ధలతో ఒకటికి రెండు సార్లు భేటీ నిర్వహించారు మంత్రి పేర్ని వెంకట్రామయ్య, అధికారులు. వివిధ సినీ థియేటర్లతో ప్రైవేట్…
సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు…