పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్ మూడో మ్యాచ్ చైనీస్ తైపీతో జరిగింది. ఒమన్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 16-0 తేడాతో తైపీని ఓడించింది. ఈ విజయంతో ఇండియా ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. 3 విజయాలతో భారత్ 9 పాయింట్లు సాధించి పూల్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు గురువారం ఇండోనేషియా ఓపెన్ 2023 నుంచి చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్తో వరుస గేమ్లలో ఓడిపోయి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 16లో తాయ్ జు యింగ్పై సింధు 18-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.