కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడులో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయనున్నారు. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా కట్టడికి సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని వారిని రైళ్లలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. …