గ్లామర్ కోసమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును వెలిగించేందుకు నటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి నేతృత్వంలోని **‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 అత్యంత వైభవంగా జరిగింది. హెచ్ఐసీసీలో జరిగిన ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు హాజరయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్…