హైదరాబాద్ సీపీఐ నాయకుడు చందు రాథోడ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక విభేదాలు, వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అటు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులోనూ ఫుల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆయనకు సన్నిహతంగా ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.
Chandu Naik Murder: మలక్పేట్ సీపీఐ నాయకుడు చందూ నాయక్ అలియాస్ చందూ రాథోడ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం, ఆర్ధిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో గుడిసెలు వేయించి అక్కడ వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు తీసుకున్నారని ఆరోపణల కూడా వెలువడుతున్నాయి. మరోవైపు చందు నాయక్ను చంపిన గ్యాంగ్కి.. చందుకి మధ్య కొన్నాళ్ల నుంచి విభేదాలు ఉన్న నేపథ్యంలోనే హత్య…