Surekha – Chiranjeevi : నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో యాంకర్ సుమ, చిరు దంపతులతో జరిపిన సరదా ముచ్చట్లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోషల్ మీడియాలో చిరంజీవి అప్పుడప్పుడు ‘చిరు లీక్స్’ పేరుతో సినిమా లీక్స్ షేర్…