మళ్లీ ఆకాశానికి రారాజుగా ఎయిర్ ఇండియా? “టాటా గ్రూప్” ప్లాన్! ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థల్లో ఒకటి. జనవరి 2022లో.. ఇది ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్కి తిరిగి వచ్చింది. టాటా మరోసారి దానిని ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం టాటా గ్రూప్ ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని కింద ఎయిర్ ఇండియా విమానాలకు కొత్త విమానాలు జోడించనున్నారు. ఐటీ వ్యవస్థలు పునఃరూపకల్పన చేయనున్నారు. అంతర్గత…
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం…
ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా.. ‘గత ప్రభుత్వంలో జరిగిన దుర్ఘటనలు. 2017 లో కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో 3 రోజుల్లో 6గురు బాలింతలు చనిపోయారు. 2017లో 5రోజుల వ్యవధిలో నీలోఫర్ హాస్పిటల్ లో 5గురు బాలింతలు చనిపోయారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం DPL పద్ధతిలో చేసిన ఆపరేషన్ లతో 4గురు మహిళలు చనిపోయారు. దీనితో వారి పిల్లలు అనాధలయ్యారు. మీరు ఇచ్చిన హామీ…
డయల్ 100పై వెంటనే స్పందించి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురవుతున్న బాధితుడిని రక్షించారు. బాధితుడిని ఆస్పత్రికి సరైన సమయానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన బండ్లగూడ పోలీసుల పనితీరును స్థానికులు,బాధితుని బంధువులు , సామాజిక మాధ్యమాల్లో చూసినవారు బండ్లగూడ పోలీసుల పనితీరును మెచ్చుకుంటు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఐజాజ్ జహంగీరబాద్ కు చెందిన ఖతిజ పరిచయిస్తులు, కొంతకాలంగా ఐజాజ్ ఖతిజను లైగింగా వేధిస్తున్నాడు, వేధింపులు ఎక్కువకావడంతో ఖతిజ…
జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ వేశారు. జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందన్న పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో జానీ మాస్టర్ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. లైంగిక వేధింపులు, పోక్సో్ కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గోవాలో ఉన్నట్లు…
ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడదుల చేశారు. అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలని, దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయన్నారు. ఈ…
హైడ్రా ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, నాలాల పైన దృష్టి పెట్టింది. మొదటి సారి రంగారెడ్డి జిల్లా ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలను హైడ్రా బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మసాబ్ చెరువు, పెద్ద చెరువుల పరిధిలోని నాలాలను హైడ్రా సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను…
మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్…
మాదాపూర్లోని ట్రైడెంట్ హోట్ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా అని, పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నా అని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా అని ఆయన వెల్లడించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి…
మాదాపూర్లోని ట్రైడెంట్ హోట్ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, లోక్ సభ సీట్లు గెలిచామని, మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోందన్నారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ…