Home
Breaking News
Breaking News News
-
Srinivas Goud : హైడ్రా బాధితులకు భరోసా.. భద్రత కల్పించాలి..
హైడ్రా విషయంలో పేదలకు భరోసా, భద్రత ఇస్తే సమస్య ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల విషయంలో పునరావాసం కల్పించాలని, కూల్చివేతలు తప్పు అనడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందరి పట్ల హైడ్రా సమానంగా వ్యవహరించాలని, అధికారులు తొందర పడొద్దన్నారు. వచ్చేది మా ప్రభుత్వమని, ఏ ప్రభుత్వం భవనాలకు అనుమతి ఇచ్చిన తప్పే అని ఆయన అన్నారు. మాపై కోపం పేదలపై చూపొద్దని, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు వ్యతిరేకం అయితే అనుకున్న… -
CM Revanth Reddy : మహిళ పేరుమీదే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు (ఎఫ్డీసీ) సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై… -
Addanki Dayakar : హైడ్రా, మూసీ విషయంలో ప్రజలకు నష్టం చేయాలని ప్రభుత్వానికి లేదు
హైడ్రా కు సంబంధించి హై కోర్టు, సుప్రీంకోర్టు ఉందని, కస్టోడీయన్గా ప్రభుత్వం కూడా ఆస్తులకు రక్షణ గా ఉండి కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనంఏమి లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సుపల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరుపున కాంగ్రెస్ పార్టీ… -
Errabelli Dayakar : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే…
డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ప్రభుత్వ స్థలం లేకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో రెండెకరాలు నాస్వంత ఖర్చులతో భూమి కొనుగోలు చేసి కట్టించానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ వాళ్లు పేదలను ఇండ్లలో నుండి… -
Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, మీడియాలలో కూల్చివేతలపై వస్తున్న వార్తాలపై ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పై ప్రభుత్వ లక్ష్యంను సవివరంగా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మీడియా ముందుకు వచ్చామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి… -
Countrymade Guns : తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కంట్రీమేడ్ తుపాకులు ఇల్లీగల్ సేల్ చేస్తున్న కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద్భంగా రాచకొండ సీపీ సుధీర్బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డి బీకామ్ మధ్యలోనే ఆపేశాడని, ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడని, ఈ క్రమంలోనే డాన్గా మారి పెద్ద క్రిమినల్గా మారాలనుకున్నాడని ఆయన వెల్లడించారు. అందుకోసం ముంబైకి వెళ్ళి గన్స్ కొనుకొచ్చాడని, వెపన్ యూజ్ చేసి ఏదో ఒక నేరం చేయాలని అనుకున్నారని, ఇతనిని నుండి ఏడు… -
Kaleshwaram Commission : ఈఎన్సీ నల్ల వెంకటేష్పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అంశం గత ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ENC నల్ల వెంకటేష్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది కమిషన్. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు… -
Steroids : మెడికల్ షాప్ ముసుగులో స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ముఠా
నిషేధిత స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపు ముసుగులో ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. జిమ్ కి వెళ్ళే యువకులే టార్గెట్ గా ఈ ముఠా విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు అధికారులు. ఆసిఫ్ నగర్, కార్వాన్ లో పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ నగర్, కార్వాన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… -
Suicide : సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్య..
ఆర్థికంగాను, స్థలం విషయంలోనూ స్నేహితులు మోసానికి పాల్పడ్డారని మనస్తాపం చెంది, తన చావుకు స్నేహితులు కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మందమర్రికి చెందిన రాజేష్(32) మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో తన భార్య కుష్మల తో కలిసి నివసిస్తూ, ఐటి కన్సల్టెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని… -
Minister Seethakka : ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది
ఈడీ రైడ్స్ పై మంత్రి సీతక్క స్పందించారు. సహాచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై జరిగిన ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను లొంగదీసుకునేందుకు ఈడీని వినియోగిస్తుంది బీజేపీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కులగొట్టడన్నే మొదటి నుంచి బీజేపీ పనిగా పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. గట్టిగా మాట్లాడిన ప్రతిపక్ష ఎంపీల ఇల్ల మీదకు ఈడీని పంపిస్తామని పార్లమెంట్…
తాజావార్తలు
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
-
Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!