ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతుంది. బీజేపీ-శివసేన కూటమి 119 స్థానాల్లో.. థాక్రే కూటమి 70 స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తానికి ముంబై మేయర్ పీఠాన్ని మహాయతి కూటమి సొంతం చేసుకోబోతుంది.
ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మహాయతి కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం బీజేపీ-శివసేన కూటమి 15 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది.
ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ముంబైతో పాటు 28 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.