గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లోనే ప్రసవించడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు.