Home
Bharatiya Janata Party
Bharatiya Janata Party News
-
గుంటూరులోని జిన్నాటవర్కు త్రివర్ణ రంగులు.. సద్దుమణిగిన వివాదం
ఏపీలోని గుంటూరు నగరంలో ఉండే జిన్నాటవర్పై నెలరోజులుగా వివాదం నడుస్తోంది. జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా జిన్నాటవర్ను కూల్చివేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు జిన్నాటవర్ చుట్టూ రక్షణ వలయం నిర్మించారు. అయితే తాజాగా ఈ వివాదానికి పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. స్థానిక అధికారులు జిన్నాటవర్కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. దీంతో జిన్నాటవర్ జోలికి ఎవరూ రాకుండా తెలివిగా వ్యవహరించారు. Read Also: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ… -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మిస్సింగ్?
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్టౌన్… -
బాడీ మసాజ్ కావాలంటే జగన్ వేసిన రోడ్లపై తిరగండి: సోము వీర్రాజు
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసుల పాటలు అని.. కానీ వైసీపీ సర్కారు క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చి పండగ వాతావరణాన్ని అబాసుపాలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధంగా… -
రాజ్భవన్కు వెళ్లకుండా కేసీఆర్ తప్పు చేశారు: ఈటల రాజేందర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకుండా తప్పుచేశారని… ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు. Read Also: 33… -
ముస్లింల చేత వందేమాతం పాడిస్తాం: సోము వీర్రాజు
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై… -
కాంగ్రెస్ బాటలో బీజేపీ.. పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలి
పంజాబ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. వచ్చే నెల 14న జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సీఎం చరణ్జీత్ సింగ్ ఎన్నికల కమిషన్ను కోరిన కొన్ని గంటలకే బీజేపీ కూడా అటువంటి విజ్ఞప్తే చేసింది. Read Also: కరోనా వ్యాక్సినేషన్పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని… -
కమలం పార్టీకి షాక్… సైకిల్ ఎక్కిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వలసలు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిలేష్ యాదవ్ ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది. Read… -
అతడి క్యారెక్టర్ నచ్చదు.. అందుకే అల్లుడిని చేసుకోలేదు: సోము వీర్రాజు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడు నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు స్వయంగా స్పందించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని… వీరిలో పెద్దమ్మాయికి తాను పెళ్లిచేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరే అల్లుళ్లు ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన పెద్దమ్మాయి తానే పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని… కాబట్టి అతడిని తన అల్లుడిగా ఎప్పటికీ… -
తెలంగాణ బీజేపీ ఎంపీపై అట్రాసిటీ కేసు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై తాజాగా మరో కేసు నమోదైంది. శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదుతో నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసులు అరవింద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్లో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా అరవింద్ వ్యాఖ్యానించారని.. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయన్ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు మరోవైపు మంగళవారం నాడు… -
హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. కారణం అదేనా..?
హైదరాబాద్ వేదిక ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరుగుతోంది.. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై కీలక చర్చ జరగబోతోంది. ఈ సమావేశంలో యాభైకి…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!