Devineni Avinash: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాల్సింది. కానీ, అవి కేవలం ఓటు కోసం చెప్పిన వాగ్దానాలుగానే మిగిలిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా…