రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఫ్రాంచైజీల విక్రయాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చూపింది. ఆర్ఆర్ను రూ.15,300 కోట్లకు ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది. రూ.16,706 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్ సంస్థలు ఆర్సీబీని కైవసం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలకు బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర…