Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. బంగ్లా సార్వత్రిక ఎన్నికలకు 48 గంటల మందు హిందూ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మైమెన్సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఆయన దుకాణంలోనే కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని త్రిషల్ సబ్ డిస్ట్రిక్ట్లోని బోగర్ బజార్ లో బియ్యం వ్యాపారిగా, మెసర్స్ భాయ్ భాయ్ ఎంటర్ప్రైజ్ యజమాని సుషేన్ చంద్ర సర్కార్(62)గా గుర్తించారు. ఇతను ఇదే ప్రాంతంలోని సౌత్కాండ గ్రామంలో నివసిస్తున్నాడు. Read…
Banglasesh: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ యువకుడిని అక్కడి మతన్మాదులు హత్య చేశారు. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది మూడో ఘటన. ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ను నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.