Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది.
కరోనా బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అజిత్రో మైసిన్ మెడిసిన్ను రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైనదని తాజా పరిశోధనలో తేలింది. అజిత్రో మైసిన్ ను వినియోగించడం వలన ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ కు చెందిన పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్ బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న 263 మందిలో 171…