శంషాబాద్ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు గురించి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు సాయికృష్ణను వేధించడంతో హత్య చేసినట్లు ఆయన తెలిపారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రియురాలిని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్ హోల్లో పడేసి చేతులు దులుపుకున్నాడు.