ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉగాది సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అధికారులు సమీక్షించి కొత్త జిల్లాల ఏర్పాటును రెండు రోజుల పాటు వాయిదా వేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు…