Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim: దశాబ్దాల నిరీక్షణ తర్వాత, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న దావూద్ కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ ప్లాట్లను ముంబైకి చెందిన ఒక వ్యక్తి అత్యధిక బిడ్తో దక్కించుకున్నారని అధికారులు తెలిపారు.
READ ALSO: Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్మీట్
Also Read
- MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
వేలం వివరాలు ఇవే..
రత్నగిరి జిల్లాలోని ముంబాక్ గ్రామంలో ఉన్న ఈ నాలుగు భూములు గతంలో దావూద్ తల్లి అమీనా బీ పేరు మీద నమోదై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్మగ్లర్లు & విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం’ కింద 2026 మార్చి 5న ఈ వేలాన్ని నిర్వహించింది. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి 2026 ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిధుల జమ అనంతరం, సంబంధిత అధికారుల నుంచి తుది ఆమోదం పొందిన తర్వాతే ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది.
ముంబాక్ ప్లాట్లపై ఆసక్తి
ఈ వేలంలో ప్రధానంగా సర్వే నెం. 442 (పార్ట్ 13-బి) ప్లాట్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. దీని రిజర్వ్ ధర సుమారు రూ.9.41 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో ఇది రూ.10 లక్షల మార్కును దాటింది. ఈ ప్లాట్ కోసం ముంబై, రత్నగిరి నుంచి ఇద్దరు బిడ్డర్లు పోటీ పడగా, మిగిలిన మూడు ప్లాట్లను ఒకే బిడ్డర్ దక్కించుకున్నారు.
ఇన్నాళ్లుగా ఎందుకు అమ్ముడవలేదంటే..
దావూద్ ఆస్తులను వేలం వేయడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి పదేపదే విఫలమవుతూ వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, అతని ముఠా (D-Company) భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకాడారు. ఇదే సమయంలో గత నవంబర్ (2025)లో ప్రభుత్వం ధరను 30 శాతం తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ భూములు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి మాత్రమే పనికొచ్చేలా ఉండటంతో తక్షణ ఆర్థిక లాభం ఉండదని కొందరు భావించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు ఈ ఆస్తుల వేలం పూర్తి కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
తాజావార్తలు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!