PVN Madhav: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయానికి వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, అనేక మంది కృషి ఫలితమే ఈ రోజు సాధ్యమైందని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో గొప్పదని తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత సాధించే ప్రయాణంలో ప్రతి ఒక్కరి…