కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కావాలి. అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవడం, కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు…