ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఘర్షణ వాతావరణం చర్చగా మారింది. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, స్పీకర్పై చేయి చేసుకున్నారు.. అడ్డుకుంటే తోసివేసి దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.. ఇదే సమయంలో.. సభలో టీడీపీ దాడి ఘటనపై క్యాంపైన్ చేపట్టారు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. టీడీపీ వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.. టీడీపీ రౌడీస్ ఇన్ అసెంబ్లీ, వైఎస్సార్ దళిత ఎమ్మెల్యే…
శాసన సభలో పార్టీ ఎమ్మెల్యే స్వామిపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.. సీఎం వైఎస్ జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారు.. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు అంటూ ఫైర్ అయ్యారు. చట్టసభలకు మచ్చ…
Eliza and Kambala Jogulu: అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనతో టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. వైసీపీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా.. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల ఘర్షణపై స్పందించిన ఆయన.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు డైరక్షన్ లోనే సభలో గలాటా చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని.. నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపైనా దాడి చేశారని.. సుధాకర్…
Deputy CM Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. జీవో నంబర్ 1పై వాయిదా తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఆ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. అందులో భాగంగా.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు టీడీపీ సభ్యులు.. ప్లకార్డులు ప్రదర్శించారు, పేపర్లు చించివేశారు, పోడియం ఎదుట బైఠాయించారు.. జీవో నంబర్ 1కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. స్పీకర్పై టీడీపీ ఎమ్మెల్యేలు దాడికి…