భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఏపీకి వాయుగండం తప్పేలా లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం 11న తమిళనాడు తీరానికి చేరనుంది. 4 రోజులు దక్షిణ కోస్తాలో భారీవర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం వుండనుంది. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ…