ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎండల ధాటికి జనాలు అల్లాడిపోతున్నారు. మరోపక్క ఎండలతోనే సతమవుతుంటే.. వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలపింది. ఈ క్రమంలో రేపు (మంగళవారం) రాష్ట్రంలోని 63 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.