రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. READ MORE: CM Chandrababu: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల…
Municipal Chairman: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత చేపట్టిన నిరసన దీక్ష నాల్గవ రోజుకు చేరింది. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేను చేసిన తప్పేంటో చూపించండి అంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఛైర్మన్ శాంత సవాల్ విసిరారు. తనను తొలగించేందుకు కౌన్సిలర్లకు భారీగా డబ్బు ముట్టిందని ఆరోపించారు. ప్రతీ కౌన్సిలర్కు లక్షన్నర ఇచ్చారని, వైస్…
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్చార్జ్ దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణవ్యాప్తంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు…
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా…
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు.
తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే…
పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని..
ఏపీలో కక్షలు, కార్పణ్యాలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన దశలో.. ఏపీ పక్కదోవ పడుతున్నట్టు స్పష్టం కనిపిస్తోంది. గతంలో జగన్ ప్రతీకార రాజకీయాలు చేసి పొరపాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ప్రతీకారం విషయంలో జగన్ బాటే పట్టడంతో.. ఏపీ భవిష్యత్తు ఏంటా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.