టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్టెల్ తన రీచార్జ్ ప్లాన్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్…