పోసాని కేసులో కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు ఆదోని పోలీసులు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.. ఈ రెండు పిటిషన్లపై రేపు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, పోసాని మురళి కృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది కర్నూలు కోర్టు..
పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్న ఆదోని త్రీ టౌన్ పోలీసులు.. పీటీ వారెంట్ పై తీసుకెళ్తున్నారు.. నిన్న నర్సరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు పోలీసులు.. రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇక, ఈ రోజు పీటీ వారెంట్ పై ఆదోనికి తీసుకెళ్తున్నారు పోలీసులు.. మొదట రాజంపేట సబ్ జైలు.. ఆ తర్వాత గుంటూరు జైలుకు.. ఇప్పుడు అక్కడి నుంచి కర్నూలు.. ఇలా ఏపీని మొత్తం పోసాని కృష్ణమురళి చుట్టేలా ఉన్నారేమో..