కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అదుపుతప్పి టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. కర్ణాటకలోని చింతమనుగురు నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది.