పెరూలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. 100 మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా 20 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా అతి వేగం, రోడ్లు…