Henry Kissinger: హెన్రీ కిస్సింజర్ ప్రఖ్యాత అమెరికన్ దౌత్యవేత్త. ఇందిరాగాంధీ హయాంలో భారత్-అమెరికా బంధాల్లో విభేదాలకు సాక్ష్యంగా ఉన్నారు. కిస్సింజర్ 100 ఏళ్ల వయసులో అమెరికాలో మరణించారు. అయితే ఇందిరాగాంధీపై కోపంతోనే అమెరికా, చైనాకు దగ్గరైందనే వాదని ఉంది. ఈ రెండు దేశాల సంబంధాల్లో కిస్సింజర్ ప్రముఖ పాత్ర వహించారు. తాజాగా మోడీ నాయకత్వంలో భారత్తో బంధాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశించారు.