బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన రైల్వే లైన్ సర్వే ఇప్పుడు ఖరారైంది. తనక్పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం తుది సర్వే పూర్తయింది. సర్వే ప్రకారం..170 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49000 కోట్లు ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే.. భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరుకోగలవు.