ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కోట్లను కొల్లగొట్టనున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లేడు. డబ్బుల విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని, పంత్ మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదని.. ఈ క్రమంలోనే పంత్ను ఢిల్లీ విడుదల చేసిందని చెబుతున్నారు. దీంతో.. వచ్చే సీజన్లో పంత్ కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.. అతను ఏ జట్టుకు ఆడుతాడన్నది మెగా వేలంలో డిసైడ్ కానుంది.