Yashaswi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashaswi Jaiswal Creates 3 Records With His Century Against Mumbai Indians: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ సాధించిన చారిత్రాత్మక విజయం కంటే.. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చేసిన సెంచరీనే టాప్ ఆఫ్ ది టౌన్గా మారింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడిన యశస్వీ.. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ మార్క్ని అందుకున్నాడు. ఓవరాల్గా 62 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు మూడు రికార్డుల్ని నెలకొల్పాడు.

Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
New York: న్యూయార్క్లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..
* ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆన్క్యాప్డ్ ప్లేయర్గా యశస్వీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అతగాడు.. 120 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇప్పుడు 4 పరుగుల తేడాతో వాల్తాటి రికార్డ్ని యశస్వీ బద్దలుకొట్టాడు.
* ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ ఉండేవాడు. 2021 సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్పై 124 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వీ ముంబైపై 124 పరుగులు చేసి, జోస్బట్లర్ రికార్డును సమం చేశాడు.
* ఐపీఎల్ చరిత్రలో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో యశస్వీ నాలుగో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో మనీష్ పాండే (2009లో ఆర్సీబీ తరఫున 19 ఏళ్ల 253 రోజులు), రెండో స్థానంలో రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు), మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ (2021లో ఆర్సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉండగా.. 21 ఏళ్ల 123 రోజుల వయసులో యశస్వీ సెంచరీ సాధించి, నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Conductor Jhansi: చైతన్య ఆత్మహత్యకు వాళ్ళే కారణం.. సంచలన నిజాలు చెప్పిన కండక్టర్ ఝాన్సీ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ చేసిన సెంచరీ పుణ్యమా అని, రాజస్థాన్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి, విజయం సాధించింది. గ్రీన్ (44), సూర్యకుమార్ (55), టిమ్ డేవిడ్ (45) ఊచకోత కోయడంతో.. ముంబైని విజయం వరించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సులు కొట్టి, తన జట్టుని విజయతీరాలకు చేర్చాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!